తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

  • 24 గంటల్లో 592 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,81,414
  • కోలుకున్న వారు 2,73,013 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,513
తెలంగాణలో గత 24 గంటల్లో 592 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 643 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,81,414కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,73,013 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,513కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,888 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  4,719 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 64,43,052 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Corona Virus
COVID19
Telangana

More Telugu News